






ఈ సినిమా విశేషాలను శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ- ‘‘ఇది ఫాంటసీ చిత్రం. హిస్టారికల్ కావచ్చు, జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు. లేకపోతే వైవిధ్యంగా ఈ మూడు నేపథ్యాలు ఇందులో ఉండొచ్చు. ఇప్పుడే ఈ సినిమా గురించి ఇతమిద్థంగా చెప్పలేను. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇది నా ఫాంటసీ దాహాన్ని తీర్చే సినిమా. ఈ చిత్రం పూర్తి కావడానికి ఓ ఏడాది పట్టొచ్చు.
ప్రస్తుతం ప్రీ విజువలైజేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘మగధీర’ కంటే హై బడ్జెట్లో ఈ చిత్రం రూపొందనుంది. విజువల్ ఎఫెక్ట్స్కు ఎంతో ప్రాధాన్యత ఉన్న కథ ఇది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఉంటుంది. సెప్టెంబరులో సెట్స్ మీదకు వెళుతుందీ సినిమా’’ అని తెలిపారు. ‘‘రాఘవేంద్రరావుగారి బ్యానర్లో సినిమా చేయడం నా అదృష్టం. రెండేళ్ల క్రితమే ఈ సినిమా గురించి చెప్పారు రాజమౌళి. మళ్లీ నా జీవితంలో ఇలాంటి సినిమా రావచ్చు, రాకపోవచ్చు.
అందుకే నా శక్తినంతా క్రోడీకరించి ఈ పాత్ర చేస్తా’’ అని ప్రభాస్ చెప్పారు. ఈ కథ తనకు తెలీదని, కథలోని గొప్పతనం తెలిస్తే దానిపై ప్రత్యేకంగా కసరత్తులు మొదలుపెడతానని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె.కృష్ణమోహన్రావు, ఆర్ట్ డైరె క్టర్ రవీందర్, నిర్మాతలు యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, గ్రాఫిక్స్: మకుట.
No comments:
Post a Comment